క్రికెట్
U-19 World Cup: నేడు ప్రపంచకప్ ఫైనల్.. భారత్ వర్సెస్ ఆసీస్
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. బెనోని వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ సిరీస్లో భారత్ వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు ప్రతి జట్టుపై విజయంతో తిరుగులేని భారత్.. ఆస్ట్రేలియా జట్టును కూడా ఓడించేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు జరగనుంది.
ALSO READ: క్రికెట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై.. ఆ సిరీస్ చివరిదని ప్రకటన
గెలిస్తే ఆరోసారి కప్..
భారత్ జట్టు ఇప్పటివరకు టోర్నీ చరిత్రలో 9సార్లు ఫైనల్కు దూసుకెళ్లి.. ఐదుసార్లు గెలుపొందారు. ఈ మ్యాచ్ కూడా విజయం సాధిస్తే ఆరోసారి అండర్-19 వరల్డ్ కప్ భారత్ వశమవుతోంది. ఇక రెండుసార్లు 2012, 2018లలో భారత్ చేతిలో ఓడిన ఆసీస్.. ఈసారి మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలని దృఢసంకల్పంతో ఉంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి మరి.