తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Vizag: వైజాగ్ లో మెరిసిన అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరో రామ్ చరణ్ తేజ్ వైజాగ్ లో సందడి చేస్తున్నారు. షూటింగ్ లకు వైజాగ్ చాలా బాగుంటుంది.. అందుకే సినిమాలను ఎక్కువగా ఇక్కడే షూట్ చేస్తారు. ఆదివారం అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లగా.. తాజాగా నేడు రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ మూవీ కోసం వైజాగ్ చేరుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. ఇప్పటికే పుష్ప2 మూవీ షూటింగ్ కోసం డైరెక్టర్ సుకుమార్, టీం కూడా నగరానికి చేరుకున్నారు. షూటింగ్ షెడ్యూల్ సన్నాహాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కానుంది.

Also read: HanuMan: ఓటిటి స్ట్రీమింగ్ పై సస్పెన్ష్.. టీవీలోకి వచ్చేస్తున్న హనుమాన్

మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ నెలాఖరు వరకు వైజాగ్ లోనే ఉండనున్నాడు. గేమ్ ఛేంజర్ షూటింగ్ పాల్గొంటాడు. మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇకపై వేగం పెంచాలని డైరెక్టర్ శంకర్ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే శంకర్ పై, నిర్మాత దిల్ రాజుపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వైజాగ్ షెడ్యూల్ గేమ్ ఛేంజర్ కి పాజిటివ్ వైబ్స్ తీసుకువస్తుందని అంతా భావిస్తున్నారు. పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదలపై మరో అప్డేట్ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button