Sriranga neethulu: ఇంట్రెస్టింగ్గా ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్
టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం శ్రీరంగనీతులు. ఈ సినిమాకు ప్రవీణ్కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తుండగా.. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
Also Read: జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం:’ప్రతినిధి-2′ టీజర్
యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే ఈ చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని చిత్రయూనిట్ తెలిపింది.