తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: మహిళకు మకుటం.. ఇది జగనన్న విజయం!

ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేసి వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయారు. అంతకుముందు కూడా దిశ బిల్లుతోపాటు నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చడంతో ఈ ఐదేళ్ల పాలనలో మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను సాధించారు.

ALSO READ:  ప్రజాక్షేత్రంలోనే జననేత..రేపటినుంచి హోరెత్తనున్న ప్రచారం

ప్రధాన ప్రత్యర్థులపై బీసీ మహిళలే..

మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌పై బీసీ మహిళ మురుగుడు లావణ్య, పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ నుంచి వంగా గీత, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణపై వైసీపీ తరపున బీసీ మహిళ టి.నారాయణ దీపికను బరిలోకి దించారు. ఇక విశాఖ ఎంపీ సీటు టికెట్‌ను బీసీ మహిళ బొత్స ఝాన్సీలక్ష్మికి ఇవ్వగా.. నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి ఓ సాధారణ కార్యకర్త, బీసీ మహిళ గూడూరి ఉమాబాల, ఎమ్మిగనూరులో బీసీ మహిళ బుట్టా రేణుక పోటీ చేస్తున్నారు.

ALSO READ: టీడీపీలో అసమ్మతి సెగలు..టికెట్‌ దక్కలేదని కన్నీళ్లు

పదవుల్లోనూ మహిళలకు పెద్దపీట..

కేబినెట్‌ నుంచి స్థానిక సంస్థల వరకు పదవుల్లో మహిళలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారు. దేశ చరిత్రలో తొలిసారి హోంమంత్రిగా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితను నియమించారు. అదే విధంగా శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా ముస్లిం మహిళను ఎంపిక చేసిన సీఎం జగన్.. మంత్రివర్గంలో నలుగురు మహిళలు తానేటి వనిత, కేవీ ఉషాశ్రీచరణ్, విడదల రజిని, ఆర్కే రోజాలకు స్థానం కల్పించారు. కాగా, గత ఎన్నికల్లో మహిళలకు 19 ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించగా.. ఇటీవల విడుదల చేసిన జాబితాలో 24కు పెంచిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button