తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan: పవన్ కల్యాణ్‌పై మండిపడుతున్న టీడీపీ నేతలు..!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారా? ఆయన తీరుతో టీడీపీ శ్రేణులకు ఎక్కడా లేని కోపం వస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ఇంతవరకు పవన్ కల్యాణ్ సొంతంగా ఒక్క బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు కారణమట. సభకు అయ్యే ఖ‌ర్చుల‌న్నీ త‌మ నెత్తినేసి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పవన్.. ఫ్రీగా బహిరంగ సభల్లో మైకుల ముందు ఊదరగొడుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు టాక్.

ALSO READ: ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి బీటలు!

మైక్ దొరికితే చాలు.. ఓ పోరాట యోధుడిలా, ఓ మహాకవిలా తెగ బిల్డప్ ఇచ్చే పవన్.. కూటమి ఏర్పడిన నాటి నుంచి తానే సొంతంగా ఒక్క బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయకపోవడం పట్ల టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. గ‌తంలో విశాఖ‌లో లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంలో, ఆ త‌ర్వాత కొత్త‌గూడెం, తాజాగా చిల‌క‌లూరిపేట‌లో నిర్వ‌హించిన టీడీపీ బ‌హిరంగ స‌భ‌ల్లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పాల్గొన‌డాన్ని ఆ పార్టీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు. పార్టీలో చేరిక‌లు ఉంటే, మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కార్యాల‌యంలో వంద మందితో స‌మావేశం నిర్వ‌హించి మ‌మ అనిపిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

ALSO READ: ఏపీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.. ఐదేళ్లలో జగన్ చేసింది ఇదే!

ఖర్చుల భారం తగ్గించుకునేందుకే పొత్తా?

అంతేకాదు, పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడారో ఇప్పుడు అర్థమైందని, ఖర్చుల భారం తగ్గించుకునేందుకు ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని అంటున్నారు. పొత్తు వ‌ల్ల స‌భ‌లు, స‌మావేశాల ఖ‌ర్చుల‌న్నీ టీడీపీ పెట్టుకుంటుంద‌ని, ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే స‌భ‌లు, సమావేశాలకు జ‌నాన్ని త‌ర‌లించేందుకు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చేద‌ని ఇప్పుడు త‌మ‌తో పొత్తు వ‌ల్ల ప‌వ‌న్‌కు ఆ ఖ‌ర్చులు లేక‌పోగా, అంతా మిగులే అని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button