AP Elections: గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో సభ.. రాష్ట్రమంతా ‘బస్సు యాత్ర’
ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయడంతోపాటు వారిలో చైతన్యం నింపేందుకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను గతంలో ఎన్నడూ జరగని విధంగా చాలా పెద్ద ఎత్తున మహా సభలు నిర్వహించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. రోజుకో ఒక మహాసభ, ప్రతి పార్లమెంట్, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్ చేసేలా ఈ సభలు జరగనున్నాయి. కాగా, ఇప్పటికే మూడు రోజుల షెడ్యూల్ విడుదల చేశారు.
ALSO READ: సామాన్య కార్యకర్తలకు సీఎం జగన్ పట్టం… వాళ్లే ఆయన బలం, బలగం
27న ప్రొద్దుటూరులో యాత్ర..
సీఎం జగన్ చేపట్టే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగనుంది. ఇడుపులపాయలో వైఎస్సార్కు నివాళులర్పించిన తర్వాత.. అదే రోజు ప్రొద్దుటూరులో యాత్ర, 28న నంద్యాలలో బహిరంగ సభ 30వ తేదీన ఎమ్మిగనూరులో బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ ప్లాన్ చేసింది. ఎన్నికల వరకు జగన్ పూర్తిగా జనాల్లోనే ఉండనున్నారు. సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా.. రాష్ట్రమంతా జగన్ బస్సుయాత్ర ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ALSO READ: పవన్ కల్యాణ్పై మండిపడుతున్న టీడీపీ నేతలు..!
ఉదయమే ఇంటరాక్షన్..
బస్సు యాత్రలో ప్రతి రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలతో ఇంటరాక్షన్, ఆ తర్వాత ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. సాయంత్రం భారీ బహిరంగ సభ కామన్గా జరుగుతుందని వైసీపీ నేత సజ్జల తెలిపారు. వీలైనంత వరకూ ఒక లోక్సభ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసేలా యాత్ర ఉంటుందన్నారు. సీఎం విరామం లేకుండా పూర్తిగా యాత్రలోనే ఉంటారని, పండుగలు, సెలవుల్లోనూ యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
👍
Good
Varalakshmi
Jai jagan
YSR Congress cm jagan sir