తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి..!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. జ‌న‌సేన‌, బీజేపీతో టీడీపీకి పొత్తు కుద‌ర‌డం ఆల‌పాటి పాలిట శాప‌మైంది. పొత్తులో భాగంగా తెనాలి సీటును జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న తెనాలిలో కార్యాల‌యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్ర‌చారానికి కూడా వెళ్తున్నారు. ఈ పరిణామం ఆలపాటిని తీవ్ర అసంతృప్తి గురిచేసింది.

ALSO READ: ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెలుగులోకి వచ్చిన టీడీపీ, జనసేనల స్కాం..!

చంద్రబాబు తీరు పట్ల ఆలపాటి తీవ్ర అసంతృప్తి

సరే.. తెనాలి కాకుండా, గుంటూరు జిల్లాలో ఏదో ఒక సీటు దక్కుతుందిలే, సర్దుకుపోదామని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. నిన్న ప్రకటించిన టీడీపీ మూడో జాబితాలోనూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు చోటు దక్కలేదు. దీంతో ఆయనకు మరోసారి భంగపాటు తప్పలేదు. ఇక మిగిలింది ఐదారు సీట్లే కావ‌డంతో ఆల‌పాటి తీవ్ర మ‌న‌స్తాపం చెందారు. చంద్రబాబు తన రాజకీయ భవిష్యత్తుతో ఆటుకుంటున్నారని ఆయనకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం తన అనునచరులతో ఆయన భేటీ అయ్యారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు TDP, BJP నేతల కుటుంబీకులే!

గుంటూరు జిల్లాలో టీడీపీ భారీ షాక్

గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు బలమైన క్యాడర్ ఉంది. ఈ జిల్లా రాజకీయాల్లో ఆయనదే కీలక పాత్ర. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఈ పరిణామం టీడీపీకి భారీ న‌ష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన, బీజేపీతో పొత్తుకు తహతహలాడిన చంద్రబాబుకు పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరు దూరం కావడంతో ఏం చేయాలో తోచడం లేదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button