తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Vizag Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు TDP, BJP నేతల కుటుంబీకులే!

విశాఖ తీరంలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా మారింది. ఆపరేషన్‌ గరుడలో భాగంగా రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసుపై వేగంగా విచారణ జరుపుతోంది. ఈ కంటెయినర్ బ్రెజిల్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు భావిస్తున్న అధికారులు అక్కడి నుంచి ఈ కంటైయినర్‌ను ఎవరు పంపారు? ఎవరికి పంపారు? డెలివరీ అడ్రస్‌ ఉన్న కంపెనీ ఎవరిది? అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే, ఈ దర్యాప్తులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో నిందితులకు టీడీపీ, బీజేపీ నేతల కుటుంబీకులతో ఉన్న సంబంధాలు ఒక్కోటి బయట పడుతున్నాయి.

ALSO READ: ప్రశ్నార్థకంగా జనసేన ఉనికి.. త్వరలో బీజేపీలో విలీనం?

సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ ఎవరిది?

డ్రగ్స్ కంటెయినర్‌ను బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టులో బుక్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. విశాఖలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ జరిగింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీకి ఈ కన్‌సైన్‌మెంట్‌ అందుకోవాల్సి ఉంది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్‌ ఉండటంతో దాని ఆధారంగా కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా.. సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై ­చైన్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.వి.ఎల్‌.ఎన్‌. గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె.భరత్‌ కుమార్‌‌పై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ALSO READ: మరోసారి అధికారం.. 49.14శాతం వైసీపీ వైపే మొగ్గు!

టీడీపీ నేతలతో నిందితుల ఫోటోలు వైరల్

ఈ భారీ డ్రగ్స్ రాకెట్‌లో నిందితులుగా ఉన్న కోటయ్య చౌదరి, వీరభద్రరావులకు టీడీపీ, బీజేపీ నేతల కుటుంబీకులతో సంబంధాలుండటం సంచలనంగా మారింది. పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటైందని తేలింది. ఇక ప్రకాశం జిల్లాకి చెందిన వీరభద్రరావు.. దగ్గుబాటి పురందరేశ్వరి మాజీ వియ్యంకుడికి చెందిన సంధ్య మరైన్‌లో పార్ట్‌నర్‌గా కూడా ఉన్నారు. దీనికి తోడు నారా లోకేశ్ తోడల్లుడు గీతం భరత్ కుటుంబంతోను వీరభద్రరావుకు సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణదేవరాయలుతో కోటయ్య చౌదరి పూర్తి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. ఆయా నేతలతో వీరు దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతన్నాయి. ఈ కేేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తే చంద్రబాబు, లోకేశ్‌ల ప్రమేయం కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button