Janmat Survey: ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. వై నాట్ 175 నినాదంతో అధికార వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. మరోవైపు.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా గెలుపు కోసం తహతహలాడుతోంది. 175 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంటే, కూటమికి మాత్రం సీట్ల పంపకాల సిగపట్లు తప్పడం లేదు.
ALSO READ: ధనబలం ఉంటేనే టీడీపీ టిక్కెట్లు..!
వైసీపీకి 105 అసెంబ్లీ స్థానాలు
అయితే, మెజారిటీ సర్వేలు మాత్రం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీనే మరోసారి రాష్ట్రంలో అధికారం చేపడుతోందని చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీకి మరోసారి అధికారాన్ని కట్టబెడతాయని స్పష్టంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సర్వే కూడా తన ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ 16 నుంచి 18 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని జన్మత్ సర్వే తెలిపింది. 100 నుంచి 105 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందని పేర్కొంది.
ALSO READ: ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు వెన్నుపోటు!
నైరాశ్యంలో కూటమి
మూడు పార్టీలు కూటమి కట్టినా.. జగన్ నేతృత్వంలోని వైసీపీని అధికారం నుంచి దూరం చేయలేరని కూడా ఈ సర్వే స్పష్టంచేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కేవలం ఐదు నుంచి ఏడు లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ కూటమి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని పేర్కొంది. దీంతో కూటమి శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
2 Comments