తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YCP: పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు ముద్రగడ భారీ స్కెచ్!

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన మీడియా ముందుకొచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాపుల కోసం ఉద్యమిస్తానని చెబుతున్న పవన్… చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఐదేళ్లు ఏ మ‌డుగులో దాక్కున్నార‌ని ప్రశ్నిస్తున్నారు. ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.

ALSO READ: బయటపడిన చంద్రబాబు భారీ కుట్ర!

పిఠాపురంలో పవన్‌కు వ్యతిరేకంగా ప్రచారం

పవన్, చంద్రబాబు ఇద్దరు రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారని వారిని నమ్మితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి మరి పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ను ఎందుకు ఓడించాలో అక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. బీసీలను అన్ని విధాలుగా మోసం చేస్తున్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం వెనకున్న రాజకీయ స్వార్థంపై నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు.

ALSO READ: ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం!

ఆపరేషన్ ‘ఆకర్ష్’తో.. పవన్‌కు షాక్!

అంతేకాదు, సినిమా వాళ్లు రాజ‌కీయాల‌కు ప‌నికి రార‌ని, సినిమా వాళ్ల తీరు మీ ఇంటికి వ‌స్తే ఏమిస్తావ్‌? మా ఇంటికి వ‌స్తే ఏం తెస్తావ్‌? అనేలా ఉంటుందని ముద్రగడ చెబుతున్నారు. పవన్ నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో ఆపరేషన్ ఆకర్ష్‌కి ముద్రగడ తెరలేపారు. గ‌తంలో ఉద్య‌మ స‌మ‌యంలో త‌న వెంట న‌డిచిన వారిని ఆయ‌న క‌లుసుకుంటున్నారు. ముఖ్యంగా కాపుల‌పై ఆయ‌న పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button