CM Ravanth Reddy: లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన… టవర్ బ్రిడ్జి సందర్శన
దావోస్ నుంచి లండన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. లండన్ టూర్ లో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను సందర్శించారు. రేవంత్ లండన్లోని ప్రపంచ ప్రసిద్ధ, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక భవనాలు, స్మారక చిహ్నాలను సందర్శించాడు. తెలంగాణలోని అనేక పర్యాటక కేంద్రాల అభివృద్ధి, వాటి ద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలి అనే కోణంలో అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎం అధ్యయనం చేశారు.
Also Read: తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన.. ధనుష్కోడిలో ప్రత్యేక పూజలు
ఈ సందర్బంగా లండన్ ఛారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించడం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో ట్వీట్ చేశారు. థేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి … ఆ పరీవాహకం అక్కడ పర్యటక, వాణిజ్య ప్రాంతంగా వర్ధిల్లుతోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మూసీ సుందరీకరణ పథకం విషయంలో తన విజన్ కు ఇది దగ్గరగా ఉందని… థేమ్స్ నది, దానిపై నిర్మాణాలు, ఆ పరీవాహకంలో వాణిజ్య కార్యకలాపాలను అధికారుల బృందంతో కలిసి అధ్యయనం చేయడం జరిగిందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.