తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

ECL Narasimhan: కేసీఆర్ ను కలిసిన మాజీ గవర్నర్.. ఆరోగ్య వివరాలపై ఆరా

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ గవర్నర్‌ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం నరసింహన్ దంపతులు కాసేపు ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు.

Also read: KTR: హైదరాబాద్ లో ఫార్ములా ఈ- రేస్ రద్దు.. కేటీఆర్ ట్వీట్

గతేడాది డిసెంబర్ లో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ లోని బాత్రూమ్ లో కేసీఆర్ జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దాంతో యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేసి నాలుగు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటినుంచి కేసీఆర్ నందినగర్‌లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ను పలువురు పరామర్శించేందుకు వస్తున్నారు.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గానే కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button