తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Ponnam: రైతుబంధుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

రైతుబంధు పథకంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన రైతులందరికీ త్వరలోనే రైతుబంధు పథకం నగదు అందిస్తామని అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని, కావాలనే తమ ప్రభుత్వం మీద అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ALSO READ: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

కాంగ్రెెస్ వంద రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపించామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చివరకు వర్షపాతంపై కూడా రాజకీయం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఒక్కటి కూడా కనిపించడం లేదని, ఆ పథకాన్ని బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని అన్నారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. త్వరలోనే అర్హులైన అందరికీ ఉచిత ఇల్లు అందిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button