Texas: అమెరికాలో ఘోర ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే కుటుంబీకులు ఆరుగురు దుర్మరణం
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు వాహనాలు ఢీకొన్న సంఘటనలో ఆరుగురు తెలుగువారు దుర్మరణం చెందారు. మృతుల్లో వైఎస్సార్ సీపీ ముమ్ముడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుటుంబసభ్యులు ఉన్నారు. దీంతో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Also Read రాహుల్ గాంధీ మరో యాత్ర.. 14 రాష్ట్రాలు.. 6,200 కిలోమీటర్లు
టెక్సాస్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మృతుల్లో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ బాబాయి నాగేశ్వరరావు కుటుంబసభ్యులు ఉన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నాగేశ్వర్ రావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో అతడి అల్లుడు లోకేశ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం ధాటికి రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.
Also Read కాంగ్రెస్ 6 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు.. రేపటి నుంచే స్వీకరణ