Eluru District: బుల్లెట్ తో సహా బావిలో పడి ఇద్దరు స్నేహితులు మృతి
కొత్త సంవత్సరం చాలాచోట్ల విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో.. పొగమంచు కారణాలతో ప్రమాదాలు సంభవించి చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ముగ్గురు మిత్రులు బుల్లెట్ బండిపై వెళ్తూ పాడుబడ్డ బావిలో పడిపోయారు. తీవ్ర గాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read మంత్రి రజనీ కార్యాలయంపై దాడి.. గుంటూరులో ఉద్రిక్తత
ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు శెట్టి సాయికుమార్, తలసిల కృష్ణ చైతన్య, రామకృష్ణలు కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. మద్యం సేవించి ఎంజాయ్ చేశారు. అనంతరం గ్రామానికి వెళ్లేందుకు ముగ్గురు బైక్ పై బయల్దేరారు. మద్యం మత్తులో బుల్లెట్ బండిని అస్తవ్యస్తంగా నడిపారు. ఈ క్రమంలో ఓ పాడుబడిన బావిని మైకంలో చూడకుండా నడిపారు. ఒక్కసారిగా బావిలోకి బుల్లెట్ బండితో సహా ముగ్గురు పడిపోయారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Also Read టిల్లుతో రెచ్చిపోయిన అనుపమ.. హాట్ ఫోజుతో పోస్టర్ విడుదల