తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Everest: రెండున్నరేళ్ల చిన్నారి అరుదైన రికార్డ్.. నెట్టింట వైరల్

ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని రెండున్నరేళ్ల చిన్నారి అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెద్ద పెద్ద వారే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక అనారోగ్య సమస్యలు ఎదుర్కుని వెనుదిరిగి వచ్చేస్తారు. కానీ.. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలుగా భోపాల్ కు చెందిన సిద్ధి మిశ్రా రికార్డు సృష్టించింది. చిన్నారి సిద్ధి మిశ్రా తల్లిదండ్రులు భావ దేహరియా, మహిమ్ మిశ్రాతో కలిసి మార్చి 22న ఎవరెస్ట్ బేస్ క్యాంపు ట్రెక్ ను పూర్తి చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read: Encounter: ఛత్తీస్ గఢ్ లో మరోసారి ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోల మృతి

ఎవరెస్ట్ పై వారి క్యాంప్ సుముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉంది. సిద్ధి తల్లి భావ దేహరియా కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 2019లోనే ఆమె ఈ ఘనతను సాధించారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాకు చెందిన భావ దేహరియా చిన్నతనం నుంచి తన గ్రామం టామియా చుట్టూ ఉన్న కొండలు ట్రెకింగ్ చేయడం ప్రారంభించింది. కాగా చిన్నారి సాధించిన ఈ రికార్డును మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమానికి అంకితం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button