ప్రత్యేక కథనం
Encounter: ఛత్తీస్ గఢ్ లో మరోసారి ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోల మృతి
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్స్టేషన్ పరిధి చీపురుబట్టి- పుస్బాక అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు ఎదురుపడ్డారు. దాంతో భద్రతాబలగాలు- మావోలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.
Also read: Mumbai: అరుదైన ఘనత సాధించిన ‘ముంబై’
ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని భద్రతా బలగాలు వెల్లడించాయి. చనిపోయిన మావోయిస్టుల వద్ద తుపాకులు,పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వాటిని సీజ్ చేసి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. మరోవైపు అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.