తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Pankaj Udhas: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో పంకజ్‌ ఉధాస్ మృతి

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో గజల్‌ దిగ్గజం, పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్ మృతి చెందాడు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు. భారతదేశంలోని ఉత్తమ గజల్ గాయకులలో ఒకరైన పంకజ్ ఉధాస్.. 1951 మే 17 న గుజరాత్‌లో జన్మించారు.

ALSO READ: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ స్పెషల్ అప్డేట్

ప్రముఖుల సంతాపం..

ఉధాస్‌ మరణవార్తను ఆయన కుమార్తె నయాబ్‌ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘బరువైన మృదయంతో.. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ తేదీన పద్మశ్రీ పంకజ్‌ ఉధాస్‌ మరణించిన విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాము’ అంటూ పోస్టు పెట్టారు. ఈ మేరకు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. కాగా, పంకజ్ ఉధాస్ అత్యంత ప్రసిద్ధ గజల్స్ లో ‘చిట్టి ఆయీ హై’, ‘ఔర్ ఆహిస్తా కిజియే బాతేన్’, ‘చండీ జైసా రంగ్ హై తేరా’, ‘నా కజ్రే కీ ధార్’ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button