తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Samantha: తిరుమలలో హీరోయిన్ సమంత.. ఫొటోలకు ఎగబడ్డ ఫ్యాన్స్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ టైమ్‍లో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఉదయం తిరుచానూరు ఆలయానికి కూడా సమంత వెళ్లారు. శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం నుంచి సమంత బయటికి వచ్చిన తర్వాత ఆమెతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

ALSO READ: శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ‘గామి’ హీరో

ఫొటోలు, వీడియోలు వైరల్..

సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని సమాచారం. సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మళ్లీ సమంత సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే విషయం తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button