Vennela Kishore: ఓటీటీలోకి వెన్నెల కిశోర్ కొత్త మూవీ‘చారి 111’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్గా నటించింది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా.. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.
ALSO READ: మూడోసారి జతకడుతున్న పూజా హెగ్డే.. అట్లీ మూవీలో ఛాన్స్
ఆహాతో పాటు ‘అమెజాన్ ప్రైమ్లో..
ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాతో పాటు ‘అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా మార్చి 16 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో ఒక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో స్పై ఏజెన్సీ హెడ్గా కనిపించనున్నారు. ఆయన ఏజెన్సీలోనే చారి పని చేసేది. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించారు. మరి మిగతా సన్నివేశాలు సినిమాలో చూడాల్సిందే.
One Comment