జాతీయం
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో ఊరట లభించింది. జైలులో ఉన్న ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు 2023 ఏప్రిల్ 04 గురువారం రోజున తిరస్కరించింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్ద అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగతంగా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది కోర్టు తెలిపింది.
Also Read: పుట్టిండో పులి పిల్ల పాలమూరు జిల్లాలోన… రేవంత్ పై మొగులయ్య పాట
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్నందున కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ వారం రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.