Go 46: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం.. ప్రజా భవన్ లో ఆందోళన
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. కొంతకాలంగా విద్యాలయాల్లో ఆందోళన చేపట్టిన నిరుద్యోగులు ఈసారి ఏకంగా ఉప ముఖ్యమంత్రి నివాసంలో ఆందోళన చేపట్టడం కలకలం రేపింది. వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఏకంగా 500 మందికి పైగా నిరుద్యోగులు ప్రజా భవన్ లో నిరసన చేపట్టారు. అయితే ప్రజా వాణికి మంత్రులు ఎవరూ రాకపోవడంతో నిరుద్యోగలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read ఎంతో చేశాం.. కానీ చెప్పుకోలేక ఓడిపోయాం: కేటీఆర్
హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసమైన ‘ప్రజా భవన్’లో శుక్రవారం నిర్వహించిన ప్రజా వాణికి నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ నిరుద్యోగులను కలిశారు. ఉద్యోగాల ప్రకటనపై ఉన్న అవాంతరాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46, 57, 55లపై నిరుద్యోగులంతా రోడ్లపైకి వచ్చారని.. న్యాయం చేయాలని విన్నవించారు. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Also Read దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం: సీఎం జగన్.. ‘జగనన్న తోడు’ నిధులు విడుదల
కాగా ఉప ముఖ్యమంత్రి నివాసంలోనే నిరుద్యోగులు ధర్నా చేయడం కలకలం రేపింది. దాదాపు గంటకు పైగా ప్రజావాణి కార్యక్రమంలో నిరుద్యోగులు బైఠాయించారు. ఎలాంటి నినాదాలు చేయకుండా శాంతియుతంగా నిరుద్యోగులు నిరసన చేపట్టారు. అయితే ఎక్కడా ఉద్యమం చేస్తారనే భయంతో పోలీసులు నిరుద్యోగులను బయటకు పంపించారు.