తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Merry Christmas: నేడే క్రిస్మస్ పర్వదినం

క్రిస్మస్ అనేది ఏసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకునే పర్వదినం. డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటారు. భారత్ లోనూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈసందర్భంగా క్రైస్తవులంతా తమ ఇళ్లను అందంగా అలకరించుకుంటారు. నూతన వస్త్రాలు ధరించి చర్చీలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక క్రిస్మస్ రోజున శాంటా క్లాస్ పిల్లలకు బహుమతులు తెస్తాడని నమ్ముతారు. వాటికోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Also read: Covid-19: మరింత విస్తరిస్తున్న కరోనా వైరస్.. దేశంలో 4 వేలకు చేరువలో కేసులు

ప్రపంచాన్ని రక్షించేందుకు దైవ దూత ద్వారా రక్షకుడైన జీసస్ భూమి మీద అవతరించిన రోజునే క్రిస్మస్ గా జరుపుకుంటారు. బెత్లేహమ్ లోని పశువుల పాకలో మేరీ మాత, జోసెఫ్ దంపతుల కడుపున జన్మిస్తాడు. అప్పుడు దేవ దూతలు వచ్చి ఆయనకు ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి గొర్రెల కాపరులకు లోక రక్షకుడు పుట్టాడని చెప్పి.. మాయమవుతారు. అప్పటి నుంచి డిసెంబర్ 25ను క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారు. లోకానికి ఏసు చెప్పిన ప్రేమ, శాంతి, కరుణ వంటి మాటలు ఎంతో అనుసరణీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button