తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Snake: విజయవాడ అమ్మవారి ఆలయంలో పాము.. భయంతో సిబ్బంది పరుగులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని ఆరాధించే భక్తులు కోట్లల్లో ఉన్నారు. దీంతో అమ్మవారి ఆలయం ఎప్పుడు భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఒక్కసారిగా ఓ పాము కలకలం సృష్టించింది. పామును చూసిన అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలోని స్కానింగ్ సెంటర్ టికెట్ కౌంటర్లో పాము దర్శనమిచ్చింది. కాగా పాముని చూడగానే కౌంటర్లో ఉన్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

Also read: Train: తెలంగాణలో మరో రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

అనంతరం ఆలయ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అనంతరం పామును పట్టే వ్యక్తి పాముని పట్టుకుని కొండ పైన వదులుతానని.. పాములను చంపకూడదని చెప్పారు. కాగా ఆ పాము విషం లేని పాము కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా పాముని చూసేసరికి భయాందోళనకు గురయ్యామని.. అయితే కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి చక్కబడిందని ఆలయ సిబ్బంది తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button