తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Viral Video: బస్సు సీటు కోసం చెప్పులతో కొట్లాట.. నెటిజన్ల కామెంట్లు

విండో సీటుకోసం కొందరు గొడవపడటం, కొన్నికొన్ని సమయాల్లో కొట్టుకోవడం జరుగుతుంది. అలాంటిదే బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ బస్ లో ఓ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read: Central Government: సైబర్ భద్రతపై కేంద్రం ఫోకస్.. 1.4 లక్షల ఫోన్ నెంబర్ల బ్లాక్

బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం ముదిరి తీవ్రంగా ఘర్షణ పడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. మహిళిద్దరూ రోజూ మెజెస్టిక్ నుంచి పీణ్యకు బస్సులో ప్రయాణిస్తుంటారు. రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాప్ వద్ద ఎక్కిన వీరిద్దరు విండో సీటు విషయంలో గొడవపడ్డారు. ఇద్దరు బాగా తిట్టుకున్నారు.. వాగ్వాదం కాస్త ముదిరింది. దీంతో జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు.. అంతటితో ఆగకుండా చెప్పులతో కొట్టుకుకోవడం ఫుటేజీలో కనిపిస్తోంది. తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ’మహిళలకు కొట్లాడటానికి , తిట్టడానికి మగవారు దొరక్కపోతే ఇలా తమలో తామే కొట్టుకుంటారని‘ ఓ నెటిజన్ హాస్యంగా స్పందించాడు.

కర్ణాటక ప్రభుత్వం కొత్తగా శక్తీ స్కీమ్ ను ప్రవేశపెట్టడంతో మహిళలకు సాధారణ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. దీంతో బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. దీనికి అనుగుణంగా BMTC కూడా బస్సు ప్రయాణాల ఫ్రీక్వెన్సీని పెంచినట్లు నివేదికలు చెపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button