T-20: ఇంగ్లండ్ అభిమానులకు బిగ్ షాక్..బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ అభిమానులకు బిగ్ షాక్. ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు టెస్ట్ క్రికెట్పై దృష్టి సారించనున్నట్లు తెలిపాడు. టెస్ట్ క్రికెట్కే తన మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశాడు.
ALSO READ: బీసీసీఐ కీలక నిర్ణయం… ఐపీఎల్లో రెండు మ్యాచ్లు రీషెడ్యూల్
12 టెస్ట్ మ్యాచ్లు..
ఇంగ్లండ్ ఈ ఏడాది మొత్తం 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. జులైలో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత స్వదేశంలో భారత్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. మొత్తం ఈ ఏడాది ఇంగ్లండ్ 12 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కాగా, ఇటీవల స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్.. భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.