తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sri Vishnu: కాంబో రిపీట్… ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్

‘బ్రోచేవారెవరురా’ సినిమాలో ఆకట్టుకున్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్.. మరోసారి రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సినిమా ‘ఓం భీమ్ బుష్’ నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్అనేది ఉప‌శీర్షిక. ఇందులో రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ సినిమాకు ‘హుషార్’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఈ సినిమా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

Also Read: హనుమాన్ ఓటీటీ ఆలస్యంపై స్పందించిన డైరెక్టర్

గుప్త నిధులు కోసం సైంటిస్టులమని చెప్పి భైరవపురం అనే గ్రామంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అడుగుపెడ‌తారు. ఆ ఊరిలో ఏ సమస్య అయినా పరిష్కరిస్తామని గ్రామస్తులను నమ్మిస్తారు. బ్యాంక్ బ్రోస్ క్లబ్‍ను పెడతారు. అయితే ఆ ఊరిలో ఉండే ఓ సన్యాసి మీరు నిజంగా మగాళ్లయితే సంపంగి మహల్‍లో ఉన్న నిధి తీసుకురావాలని ఆ ముగ్గురికి సవాల్ చేస్తారు. దీంతో ఆ నిధిని క‌నిపెట్టాడానికి మహల్ లోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఈ ముగ్గురు మహల్ లోకి వెళ్లిన అనంతరం జరిగిన సంఘటనలు ఏంటి.? అసలు ఆ మహల్ లో ఏముంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button