Varun Tej: ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్.. అదిరిన విజువల్స్
మెగా హీరో వరుణ్ తేజ్, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ జంటగా నటించిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో మార్చి 1న రిలీజ్ అవుతోంది.
Also Read: ‘బడే మియాన్ చోటే మియాన్’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ విడుదల
వరుణ్ తేజ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఓ హిట్ కొట్టేందుకు చాలా టైం పడుతోంది. గని, గాండివధారి అర్జున అంటూ ఇలా ప్రయోగాలు చేశాడు కానీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఎఫ్ 2, ఎఫ్ 3లు వసూళ్లు సాధించినా.. ఆ హిట్టు క్రెడిట్ వరుణ్ తేజ్ ఖాతాల్లోకి రాదు. ఫిదా, తొలిప్రేమ వంటి హిట్లు వరుణ్ తేజ్కి రావడం లేదు. ఇలా తాను చేస్తున్న చిత్రాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ప్రయోగాలు మాత్రం ఆపడం లేదు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో నార్త్, సౌత్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు.
Also Read: వాళ్లు ఆ సినిమాలను బాత్రూమ్లలో చూస్తారు… ఆర్జీవీ సెన్షేషనల్ కామెంట్స్
ఈ మూవీ తెలుగు ట్రైలర్ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్.. ‘రుద్ర.. యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు ఎంగేజ్’ అనే డైలాగ్తో ఆరంభం అవుతుంది. ‘నీకసలు బయమేయదా?’, ‘ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు’, ‘ఏం జరిగినా సరే.. చూసుకుందాం’ అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక హిందీ వెర్షన్ ట్రైలర్ను బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ విడుదల చేశారు.
Also Read: మహేశ్ బాబు అన్న కూతురు డ్యాన్స్… ఎనర్జీ మామూలుగా లేదుగా!
ఈ ట్రైలర్లోని సీన్లు, విజువల్స్, యాక్షన్ సీన్స్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. గూస్ బంప్స్ తెప్పించే ఎన్నో సీన్లు ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త రకమైన అనుభూతిని ఇచ్చేలా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. 2019 ఫిబ్రవరి 14న బాలాకోట్ మీద పాకిస్తాన్ చేసిన దాడుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
Also Read: గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్… మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే!
ఎయిర్ ఫోర్స్ సైన్యం అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ఫోర్స్ పైలట్గా కనిపించనున్నారు. మానుషి చిల్లర్ ఉన్నతాధికారి పాత్ర పోషించారు. ఈ సినిమాలో నవదీప్, రుహాణి శర్మ కీలక పాత్రలు చేశారు.