Asian Games: అదరగొట్టిన బోపన్న- రుతుజ జోడి… భారత్ కు మరో స్వర్ణం
చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. టెన్నిస్ విభాగంలో భారత్ తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో 2-6, 6-3, 10-4 తేడాతో థైపీకి చెందిన సంగ్-లియాంగ్ జోడీని బోపన్న, రుతుజా ద్వయం ఓడించింది. కాగా ఇది భారత్కు 9వ గోల్డ్మెడల్ . ఇక ఈ ఆసియా క్రీడల్లో 35 పతకాలతో భారత్ ఐదో స్ధానంలో కొనసాగుతోంది.
రెండవ సెట్లో 27 ఏళ్ల భోస్లే విరోచిత ఆటను ప్రదర్శించింది. స్టన్నింగ్ రిటర్న్ షాట్స్తో కేక పుట్టించింది. సాకేత్ మైనేని, రామ్కుమార్ రామనాథన్లతో కూడిన పురుషుల డబుల్స్ జోడి మ్యాచ్లో సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకుంది.
అంతకుముందు షూటింగ్ విభాగంలో సరబ్జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడీ రజత పతకం గెలుచుకుంది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్కు పతకం వచ్చింది. ఇప్పటి వరకు షూటింగ్లో పతకాల సంఖ్య 19కి చేరుకుంది.