తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Iga Swiatek: స్వియాటెక్ మ‌రో ఘ‌న‌త..‘ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డు

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పోలాండ్‌ టెన్నిస్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ మ‌రో ఘ‌న‌త సాధించింది. వ‌రుస‌గా రెండో ఏడాది డ‌బ్ల్యూటీఏ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డు గెలుచుకుంది. దీంతో అమెరికాకు చెందిన సెరెనా విలియ‌మ్స్ త‌ర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి క్రీడాకారిణిగా స్వియాటెక్ చ‌రిత్ర సృష్టించింది. సెరెనా 2014, 2015లో ఈ అవార్డు అందుకోగా.. స్వియాటెక్ 2022, 2023లో ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డు గెలిచింది.

ALSO READ: టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన…నేపాల్ పై ఘనవిజయం

నంబ‌ర్ వన్ ర్యాంకు స్వియాటెక్

పోలాండ్‌కు చెందిన 22 ఏళ్ల స్వియాటెక్ గత నెలలో మెక్సికోలోని కాంకున్‌లో జరిగిన WTA ఫైనల్స్‌లో అజేయంగా సీజన్‌ను ముగించింది. దీంతో ఏడాది ఆరంభం నుంచి జోరుమీదున్న స్వియాటెక్ నంబ‌ర్ 1 ర్యాంకుకు ఎగ‌బాకింది. ఈ సీజ‌న్‌లో స్వియాటెక్‌ రికార్డు స్థాయిలో ఆరు వ‌ర‌ల్డ్ టూర్ టైటిళ్లు గెలిచింది. ఈ సీజ‌న్‌లో 79 మ్యాచ్‌లు ఆడిన ఆమె 68 విజ‌యాలు న‌మోదు చేసింది. సూప‌ర్ ఫామ్‌తో రెండోసారి డ‌బ్ల్యూటీఏ ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button