తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Karimnagar: ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా?: కేసీఆర్

తెలంగాణలో పరిపాలనపై అవగాహన లేని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ కరెంట్ కోతలు చూడలేదని.. ప్రస్తుత కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు.

Also Read: కవితకు బిగ్ షాక్…సీబీఐ విచారణకు కోర్టు అనుమతి

చనిపోయిన రైతుల వివరాలు 48 గంటల్లో ఇవ్వాలని సీఎం అడిగితే.. 4 గంటల్లోనే పంపించానని తెలిపారు. పరిహారం ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి చనిపోయిన రైతుల ఉసురు తగులుతుందని శాపం పెట్టారు. కొత్త ప్రభుత్వంపై వెంటనే విమర్శలు చేయొద్దని.. నాలుగు నెలల సమయం ఇచ్చినట్లు తెలిపారు. కానీ, రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన చెందారు. రైతుబంధు, రుణమాఫీ విడుదల చేయకుండా రైతాంగాన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.

Also Read: పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీలు… కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కల్యాణ లక్ష్మిలో లక్ష సాయంతో పాటు తులం బంగారం, నాలుగు వేల పెన్షన్ ఇస్తామని గొప్పలకు పోయి ఇప్పుడు సప్పుడు చేస్తలేరని విమర్శించారు. పథకాలు అందని వారు మంత్రులను తరిమికొడతారని అన్నారు. దళితబంధు ఇవ్వకుండా దళితులను, గొర్రెల పంపిణీ ఆపేసి యాదవులను, చేనేతలను ఇలా అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా ముంచిందని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button