TS- TET: టెట్ అభ్యర్థులకు శుభవార్త.. ఇక నుంచి 8 భాషాల్లో ప్రశ్నాపత్రం
తెలంగాణలో టీచర్ ఎలిజిబెలిటీ టెస్ట్ (టెట్)–2024 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈసారి పరీక్షకు పశ్నాపత్రాన్ని రెండు భాషల్లో ముద్రించనున్నారు. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతి, తమిళం తదితర 8 భాషాల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ సారి కూడా టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పించారు. పేపర్–1 ను ఐదో తరగతి వరకు టీచర్గా ఉండాలనుకునే వారికి, పేపర్–2 ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు టీచర్ గా ఉండాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు.
Also read: PM Modi: భూటాన్ లో ప్రధాని పర్యటన.. అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం
మరో వైపు టెట్ పరీక్ష ఫీజు వెయ్యి రూపాలయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. రెండు పేపర్లు రాస్తే రూ.2 వేలు చెల్లించాలి. గతంలో ఒక్క పేపర్ రాసినా.. రెండు పేపర్లు రాసిన ఎగ్జామ్ ఫీజు రూ.400 లే ఉండేది. ప్రస్తుతం పెంచిన ఫీజును చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ కావడంతో ఫీజును భారీగా పెంచినట్టు సమాచారం. శుక్రవారం రాత్రి విద్యాశాఖ టెట్ డిటైల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహిస్తామని, జూన్ 12న ఫలితాలు ప్రకటిస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. పూర్తి వివరాలకు https://schooledu.telangana.gov.inను చూడాలన్నారు. అయితే, టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో, టీచర్లూ, ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఈ సారి అవకాశం కల్పించారు.
2 Comments